Asalem Jarigindhi Movie Launched

అసలేం జరిగింది సినిమా షూటింగ్ ప్రారంభం
శ్రీరాం, సంచితా పడుకొణే హీరోహీరోయిన్లుగా అసలేం జరిగింది సినిమా షూటింగ్ ప్రారంభమైంది. నమస్తే తెలంగాణ చీఫ్ ఎడిటర్ కట్టా శేఖర్రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు సి.శేఖర్రెడ్డి క్లాప్ కొట్టారు. ముహుర్తపు షాట్ను హీరో శ్రీరాం, డ్యాన్సర్ల మీద చిత్రీకరించారు. ఈశ్వర్ ఈ సినిమా ద్వారా డ్యాన్స్ మాస్టర్గా పరిచయం అవుతున్నారు.
ఎక్సోడస్ మీడియా బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా కెమెరామన్ ఎన్వీఆర్ తొలిసారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ చక్కటి సంగీతాన్ని అందించగా.. కథను నెర్రపల్లి వాసు అందించారు.

ఈ సందర్భంగా కట్టా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘గ్రామీణ నేపథ్యంలో ఒక సస్పెన్స్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నందుకు చిత్ర యూనిట్ కు అభినందలు. ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న కథాంశాన్ని ఎంచుకుని, ఆకర్షణీయమైన రీతిలో చిత్రీకరించిన సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి. అలాంటి కోవలోకే అసలేం జరిగింది సినిమా వస్తుంది’ అని తెలిపారు.
క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు సి.శేఖర్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలోని అందమైన లొకేషన్లలో సినిమా చేయడం స్వాగతించాల్సిన విషయమన్నారు.
నిర్మాత కె. నీలిమా మాట్లాడుతూ.. తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుతున్నామని.. మే చివరిలోపు సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.