Rashmika Mandanna To Pair Up With Nithin For Bheeshma

నితిన్ జోడీగా రశ్మిక
సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో చేసిన ‘శ్రీనివాస కల్యాణం’ డిజాస్టర్ అవడంతో, నితిన్ తదుపరి సినిమా కోసం కొంచెం ఎక్కువ సమయమే తీసుకున్నాడు. సబ్జెక్ట్ విషయంలో మరింత శ్రద్ధ చూపిస్తూ వచ్చాడు. అనేక కథలు విన్న తర్వాత ‘ఛలో’ ఫేం వెంకీ కుడుముల చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
నాగశౌర్య హీరోగా వెంకీ రూపొందించిన తొలి చిత్రం ‘ఛలో’ చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు తన రెండో సినిమానీ లవ్ ఎంటర్టైనర్గా రూపొందించేందుకు అతను సిద్ధమవుతున్నాడు. తన తొలి చిత్ర కథానాయిక రష్మికా మండన్ననే ఈ సినిమాకీ హీరోయిన్గా ఎంచుకున్నాడు.
నితిన్తో అతను డైరెక్ట్ చేయబోయే సినిమాకు ‘భీష్మ’ అనే టైటిల్ ఖాయం చేశారు. త్వరలోనే ఈ సినిమా లాంఛనంగా మొదలు కానున్నది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు కూడా కొద్ది రోజుల్లో వెల్లడి కానున్నాయి.