మహేష్ చేతుల మీదుగా ‘ఆపరేషన్ గోల్డ్ఫిష్’ టీజర్ విడుదల

‘వినాయకుడు, విలేజ్లో వినాయకుడు, కేరింత’ విజయాల తర్వాత అడివి సాయికిరణ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్ఫిష్’. ఆది సాయికుమార్, అబ్బూరి రవి, సషా చెత్రి, కార్తిక్రాజు, నిత్యా నరేష్, పార్వతీశం ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ప్రతిభా అడివి, కట్టా ఆశిష్రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభరెడ్డి, గ్యారీ బీహెచ్, సతీష్ డేగలతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ను మహాశివరాత్రి కానుకగా సూపర్ స్టార్ మహేష్బాబు చేతుల మీదుగా విడుదల చేశారు.
క్రాస్ జోనర్లో యాక్షన్, రొమాంటిక్ కామెడీ అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందించారు. 1980 నాటి కాలంలో కశ్మీర్ పండిట్ కుటుంబాలకు జరిగిన అన్యాయాలను ప్రధానంగా చూపించారు. హైదరాబాద్లో స్థిరపడిన కశ్మీర్ పండిట్ కుటుంబాల్ని కలుసుకొని వారి బాధలను స్వయంగా తెలుసుకొని మరీ సాయికిరణ్ ఈ కథను రాసుకున్నారు.
ఈ చిత్రంలో ఆది సాయికుమార్ ఎన్ ఎస్జీ కమాండో పాత్రలో కనిపిస్తారు. కశ్మీర్ పండిట్ కుటుంబాలకు సంబంధించిన కథకు మరో చక్కటి కాలేజ్ క్యాంపస్ స్టోరీని జోడించి ఈ చిత్రాన్ని రూపొందించారు. సషా చెత్రి, కార్తిక్రాజు, నిత్యానరేష్, పార్వతీశం కాలేజ్ స్టూడెంట్స్ లా కనిపిస్తారు. గాజి బాబా పాత్రను అబ్బూరి రవి పోషించారు. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఇటీవలే త్రివిక్రమ్ విడుదల చేసారు.
మనోజ్ నందం, రావు రమేష్, అనీష్ కురువిల్లా, కృష్ణుడు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జైపాల్రెడ్డి, ఆర్ట్: జె.కె.మూర్తి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, కాస్ట్యూమ్ డిజైనర్: కీర్తి సిరికొండ, యాక్షన్: రామకృష్ణ, సుబ్బు, నభా, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను, కో.ప్రొడ్యూసర్: దాయోధర్ యాదవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్రెడ్డి తుమ్మ, పి.ఆర్.ఓ: నాయుడు-ఫణి.

Related articles: