‘సరిలేరు నీకెవ్వరు’కి స్ఫూర్తి ఆ సినిమాలా?

‘సరిలేరు నీకెవ్వరు’కి స్ఫూర్తి ఆ సినిమాలా?
‘మహర్షి’ తరువాత మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ని అనిల్ సుంకర, దిల్ రాజు, మహేశ్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు (మే 31) ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్ని ఖరారు చేయడమే కాకుండా.. పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఇదిలా ఉంటే.. ఈ రోజు విడుదల చేసిన టైటిల్ లోగోని పరిశీలిస్తే ఓ విషయం స్పష్టమవుతోంది. టైటిల్ పక్కన తుపాకి, దానిపై ఉన్న సోల్జర్ క్యాప్ చూస్తుంటే.. ‘సరిలేరు నీకెవ్వరు’ మిలటరీ నేపథ్యం ఉన్న కథతో తెరకెక్కుతోందని అర్థమవుతోంది. అంతేకాదు.. ఈ లోగోని బట్టి సినిమా కథపై ఫిల్మ్నగర్ సర్కిల్స్లో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదేమిటంటే.. వెంకటేశ్ ‘వారసుడొచ్చాడు’, మహేశ్ ‘అతడు’ తరహాలో ఈ చిత్రకథ ఉంటుందట. అంటే.. ఒకరి స్థానంలోకి మరొకరు (కథానాయకుడు) వచ్చే కథాంశంతో ఈ చిత్రం సాగుతుందట.
కథ రీత్యా.. మిలటరీలో పనిచేసే మహేశ్ తన స్నేహితుడి కోసం అనుకోని పరిస్థితుల మధ్య ఆ స్నేహితుడి గ్రామానికి రావడం, అక్కడ అతని కుటుంబానికి సాయపడటం వంటి అంశాలతో ఈ సినిమా ఉంటుందట. అయితే.. ఈ కథాంశం చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు మాత్రం చాలా హిలేరియస్గా ఉంటాయని టాక్. అలాగే.. మహేశ్ మిత్రుడి తల్లి పాత్రలో విజయశాంతి కనిపిస్తుందని సమాచారం. మరి.. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే 2020 సంక్రాంతి వరకు వేచిచూడాల్సిందే.
‘సరిలేరు నీకెవ్వరు’కి స్ఫూర్తి ఆ సినిమాలా? | actioncutok.com
More for you: